Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఘనంగా జరిగిన హోమాలు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని మార్కెట్ వీధిలో గల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో మూడవ రోజు శుక్రవారం అర్చకులచే విశ్వకేశాన ఆరాధనము, పుణ్యాహవాచనము, అగ్ని ప్రణయం క్షీర జలదాశివాసములు ఆదివాల, నవగ్రహ, గణపతి హోమములు తదితర కార్యక్రమాలను మంగళ, వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య, ఘనంగా శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షులు జక్కా చిన్న సింగరయ్య, ఉపాధ్యక్షులు జింక రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి జింక చిన్నప్ప, కమిటీ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 25 మంది పురోహితులచే పూజా కార్యక్రమాలను ఘనంగా భక్తాదుల నడుమ నిర్వహించారు. తదుపరి కుల బాంధవులు కార్యవర్గ సభ్యులు సాంప్రదాయ దుస్తులతో, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కలశ శోభాయాత్రను నిర్వహించారు. ఈ శోభాయాత్రలో కూడా ఎమ్మెల్యే సాంప్రదాయ దుస్తులతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల కూడా పాల్గొన్నారు. పద్మశాలీల కులదైవంగా పూజింపబడుతూ చేనేత కుటుంబాల కొంగుబంగారమైన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన రుషింద్రుల వారి దేవాలయంలో ఆలయ శిఖర, గర్భాలయ, ముఖ మండప ,రాజా గోపురముతో సర్వాంగ సుందరముగా కమిటీ ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. తదుపరి గ్రామోత్సవము, అగ్ని ప్రణయనం అర్చకులు నిర్వహించగా, దాదాపు 2000 మంది పద్మశాలీల ఆడపడుచులు కలశాలతో గాంధీనగర్ మారుతి రాఘవేంద్ర స్వామి దేవాలయం నుండి శోభాయాత్రగా ఊరేగింపుగా వచ్చి, మార్కండేయ స్వామి దేవాలయం కు చేరుకున్నారు. ఈ వేడుకలు డిసెంబర్ 4వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని దేవాలయ అధ్యక్షులు తెలిపారు. అనంతరం శ్రీ అన్నమయ్య సేవా మండలి వారి ఆధ్వర్యంలో పొరాల పుల్లయ్య శిష్య బృందం ఆధ్వర్యంలో కేరళ పంచమ సింగారి వాయిద్యం అందరిని అలరించింది. ఈ కార్యక్రమంలో సంగం ఉపాధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు సమన్వయ కమిటీ సభ్యులు, సహాయ కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులు, ప్రచార కార్యదర్శులు, డైరెక్టర్లు ,అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img