Friday, April 26, 2024
Friday, April 26, 2024

నూతన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎంపిక


విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని ప్రెస్ క్లబ్లో బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ధర్మవరం తాలూకా యూనిట్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి అధ్యక్షతన ఈ నూతన కమిటీ కార్యక్రమం జరిగిందని, జిల్లా కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ ఎన్నికల అధికారిగా వేమారెడ్డి ఉప ఎన్నికల అధికారిగా నూతన కమిటీని వీరి ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగింది. ఈ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. నూతన కమిటీలో తాలూకా కార్యవర్గం లో అధ్యక్షులుగా యు.శివయ్య, కార్యదర్శిగా వై. మహేంద్ర నాథ్, అసోసియేట్ అధ్యక్షులుగా అశోక్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కె. చంద్రశేఖర్ రెడ్డి, ఎస్. జయశ్రీ, పి. మనోహర్ బాబు, ఎన్. లలితమ్మ, .ఎస్ ఓబులేసు, జిలాన్ భాష, సహకార దర్శులుగా ఏ. రంగనాయకులు, బి. రాంబో జీ నాయక్, పి. మల్లేశ్వరమ్మ ,కె.చంద్రశేఖర్, ఎం. గౌతమి, బి. శ్యామల, జే.వరప్రసాద్- ట్రెజరర్,ఈ. రమణారెడ్డి- ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img