Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలి

ఎస్కే యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున రెడ్డి
ఫోటో నెంబర్ 12:: ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళితే భవిష్యత్తు బంగారు బాట అవుతుందని ఎస్కే యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని నాగులూరు లోగల రూపా రాజా పిసిఎన్ఆర్ పాఠశాల 15వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పదవ తరగతి స్థాయి అనేది విద్యా దశలో మొట్టమొదటి దశ అని, ఇక్కడే అనుకున్న మార్కులు సాధిస్తే, భవిష్యత్తులో విద్య అనుకూలంగా లభిస్తుందని తెలిపారు. ఇష్టపడి, కష్టపడి చదివినప్పుడే చదువు మీద ధ్యాస ఉంటుందని, తల్లిదండ్రులను, పెద్దలను, ఉపాధ్యాయులను, గౌరవిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను, తప్పక అభ్యసించాలని వారు సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్, పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్, డైరెక్టర్లు రూపా రాజాకృష్ణ ,జగదీష్, కరెస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ శైలజ రెడ్డి, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img