Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పది ఫలితాల్లో విజయ దుందుభి మోగించిన మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు

విశాలాంధ్ర,కదిరి. పట్టణ పరిధిలోని మున్సిపల్ హై పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.నాగరాజు తెలిపారు.149 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 25 మంది విద్యార్థులు 500 పైగా మార్కుల సాధించారన్నారు. గుణ శ్రీ 600లకు గాను (572), హర్షిత( 572) తరుణ్ కుమార్ రెడ్డి (559) శరత్ (551) భరత్ కుమార్ (545) ఇస్మాయిల్ 54 మొహమ్మద్ సాహిల్ (549) మార్కులు సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నాగరాజు మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తమ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం సంతోషదాయ కమన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మున్సిపల్ హై స్కూల్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ఇందుకు నిదర్శనం నేడు వెలువడిన ఫలితాలే అన్నారు. మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img