Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

అక్రమంగా తరలిపోతున్న సబ్సిడీ బియ్యం స్వాధీనం

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ మండలం లత్తవరం గ్రామ సమీపంలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిపోతున్న 41 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని బుధవారం ఉదయం విజిలెన్స్ సిఐ రామారావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి బియ్యాన్ని, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అక్షయను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. ఈ బియ్యం ఎవరివి ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళుతున్నది పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఏఈ వీరేంద్ర, ఉరవకొండ సిఎస్ డి టి రమేష్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img