Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

టిపిఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో వివాహ కార్యక్రమానికి సామాగ్రి పంపిణీ..

విశాలాంధ్ర-గుంతకల్లు : టిపిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విడివిడిగా జరుగుతున్న రెండు వివాహాలకు టిపిఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తలారి పరుశురాముడు వధూవరుల కుటుంబానికి పెళ్లి సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిపిఆర్ ట్రస్ట్ స్థాపించి నేటికీ అనునిత్యం సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 200 ల పైచిలుకు వధూవరుల పెళ్లి వివాహాలకు తోడ్పాటును అందించడం జరిగింది అన్నారు ఈ సేవా కార్యక్రమంలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనే భేదాలు లేకుండా అందరికీ సమానంగా సేవనందించమన్నారు. ఈ కార్యక్రమంలో వధూవరుల తల్లిదండ్రులు పాత గుంతకల్లు లక్ష్మీదేవి,కొనకొండ్ల గ్రామస్తులు రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img