Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

నరసింహ స్వామిని దర్శించిన రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌

విశాలాంధ్ర`ఉరవకొండ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌ కాకర్ల చెన్నారెడ్డి కుటుంబ సమేతంగా శనివారం పెన్నా హాబిలం నరసింహస్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో విజయ్‌ కుమార్‌ స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవదాయ శాఖ అధికారి రామాంజనేయులు, ఉరవకొండ తాసిల్దార్‌ బ్రహ్మయ్య, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img