Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

మట్టి నమూనాలపై అధికారులకు శిక్షణ తరగతులు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ మండల వ్యవసాయ అధికారి కార్యాలయం నందు శనివారం మండల వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి మట్టి నమూనాల సేకరణ మరియు మట్టి పరీక్షలపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో పెనుకొండ వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ స్వయంప్రభ మాట్లాడుతూ రైతు పొలాలలో మట్టి నమూనాలను సేకరించు విధానం, జాగ్రత్తలు మరియు మట్టి పరీక్షల వల్ల ఉపయోగాలను తెలియ జేయడమైనది. అనంతరం పెనుకొండ రైతు భరోసా కేంద్రం పరిధిలో గల రైతు శ్రీనివాసులు పొలంలో వ్యవసాయ అధికారి సురేంద్ర నాయక్ మట్టి నమూనా సేకరించు విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించడమైనది.ఈ సమావేశంలో వ్యవసాయ విస్తరణ అధికారి మరియు రైతు భరోసా కేంద్రము సిబ్బంది పాల్గొనడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img