Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించిన తెదేపా నాయకులు

విశాలాంధ్ర-పెనుకొండ : మండల పరిధిలోని కొండం పల్లి గ్రామానికి శ్రీరాములు నాయక్ కుటుంబ సభ్యులు ఇంటికి వైసీపీ నాయకులు స్టిక్కర్లు బుధవారం రాత్రి అతికిస్తుండగా మీరు ఏమి చేశారని స్టికర్ అతికిస్తున్నారు మా ఇంటికి ఎటువంటి పథకాలు రాలేదు వికలాంగ పెన్షన్ పెంపు పై ప్రశ్నించగా , స్టిక్కర్లు అతికించకూడదని ప్రశ్నించగా శ్రీరాములు నాయక్ కుటుంబం పై స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు దాడి చేశారు ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మని అలాగే మా కుటుంబ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీరాములు నాయక్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ అధైర్య పడకండి అండగా మేముంటాం అని భరోసా కల్పిస్తూ వైసిపి నాయకుల దాడిని తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆమెతో పాటుగా మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు గుట్టురూ మాజీ సర్పంచ్ సూర్యనారాయణ ,సుబ్రహ్మణ్యం, త్రివేంద్ర నాయుడు, వాసు దేవ రెడ్డి రవి దాదు తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img