Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

సచివాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

విశాలాంధ్ర`ఉరవకొండ : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామ సచివాలయాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి శుక్రవారం సందర్శించారు. సచివాలయ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి దైనందిన విధులు, ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయో ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని రకాల సేవలను ప్రజలకు సకాలంలో అందేలా పని చేయాలని సూచించారు. అనంతరం ఆయన అదే గ్రామంలో అప్పులు బాధలు లేక ఆత్మహత్య చేసుకున్న గడ్డి మల్లికార్జున మృతదేహాన్ని ఆయన సందర్శించారు మల్లికార్జున ఆత్మహత్యకు గల కారణాలను ఆయన కుటుంబ సభ్యులతో అరా తీశారు ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలని స్థానిక పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎస్పీతో పాటు ఉరవకొండ యు.పి.ఎస్‌ సి.ఐ హరినాథ్‌ , తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img