Friday, April 26, 2024
Friday, April 26, 2024

అవ్వాతాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. సీఎం జగన్‌

అవ్వా తాతలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ మాటను నిలబెట్టుకున్నానని, పెన్షన్లను పెంచామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. రాజమండ్రిలో పెన్షన్‌ వారోత్సవాల కార్యక్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ 64లక్షల కుటుంబాలకు ఆర్థిక సౌలభ్యం పెరిగిందన్నారు. గత జులై నుంచి డిసెంబర్‌ వరకు అర్హులైన వారికి కొత్త కార్డులు ఇస్తున్నామన్నారు. రేషన్‌, ఆరోగ్య శ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. ఇచ్చిన మాట నిలుపుకుంటూ మరో ముందడుగు వేశామన్నారు. పెన్షన్లను రూ.2750కి పెంచి మరో అడుగు ముందుకేశామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img