ఆర్టీసీలో 1168 పోస్టుల భర్తీకి కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ాఅధికారులు కారణ్యం చూపేనా!్ణ శీర్శికన వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గతంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చేసిన ప్రయత్నాలను సవివరంగా వివరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కేటగిరిల్లోని ఖాళీలను కారుణ్య నియామకాల కింద భర్తీ చేసేందుకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల పీటీడీ(ఆర్సీ) నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసి యేషన్(ఎన్ఎంయూఏ) హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారొక ప్రకటన చేస్తూ 2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ మధ్య సర్వీసులో మృతి చెందిన ఉద్యోగుల పిల్లలు, భార్యలకు జీవన భృతి కింద కారుణ్య నియామకాలు ఇవ్వలేదని వారు తెలిపారు.