Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లకు న్యాయం చేయాలి : రఘురామ

అంగన్‌వాడీ ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరిస్తామని సీఎం జగన్‌ చెప్పారని, ఇప్పుడు న్యాయం చేయాలని అడిగిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లను అరెస్ట్‌ చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.బుధవారం ఆయన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది ఆశావర్కర్లు, లక్షకు పైగా అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లను అరెస్ట్‌ చేయించడం ఏంటని రఘురామ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img