నష్టపరిహారం కేసు పెడతాం: రోజా
రాజమండ్రి`తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. ఉదయం 9.20కి రాజమండ్రి నుంచి బయలుదేరిన విమానం ఉదయం 10.20కి తిరుపతికి చేరాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపం కారణంగా విమానం గంటపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. . కానీ పైలెట్ తిరుపతిలో దిగాల్సిన విమానాన్ని బెంగుళూరులో సురక్షితంగా దించాడు. ఆ సమయంలో విమానంలో ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే రోజా, జోగీశ్వరరావు సహా ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడిరచారు. రోజా మీడియాతో ఫోన్లో మాట్లాడుతూ, వాస్తవంగా టెక్నికల్ సమస్యతో విమానాన్ని ల్యాండిరగ్ చేయలేకపోయారని చెప్పారు. కానీ అక్కడ అనుమతి ఉందో తెలియదని తెలిపారు. డోర్లు కూడా ఓపెన్ చేయలేదని, ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉండటం వల్ల స్వల్పంగా విమానం ఊగినట్లు తెలిపారు. మళ్లీ విమానం తిరుపతి వెళుతుందని చెప్పారు కానీ ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పడం లేదని తెలిపారు. అయితే విమానం ఉన్న ప్రయాణికులు తమను కింద దింపాలని అంటున్నారని తెలిపారు. అయితే సిబ్బంది మాత్రం తమకు భద్రతపరమైన అనుమతులు వస్తే దింపుతామని చెప్పారని రోజా తెలిపారు. అదనంగా టికెట్కు రూ. 5వేలు అడిగారని, ఇండిగోపైన కేసు వేస్తానని రోజా అన్నారు.