Friday, April 26, 2024
Friday, April 26, 2024

సీఎం జగన్‌ ఎప్పుడూ ఉద్యోగుల పక్షపాతి : సజ్జల

పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో విడివిడిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సజ్జల వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో ఉందని పేర్కొన్నారు. తమకు ఇంత కావాలని ఉద్యోగులు చెప్పడంలో తప్పు లేదని.. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని సజ్జల అన్నారు. పట్టు విడుపులు అటూ ఇటూ ఉండటం కామనేనన్నారు. సీఎం జగన్‌ ఎప్పుడూ ఉద్యోగుల పక్షపాతిగా ఉంటారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img