ఏపీ ఈఏపీ సెట్ షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో జూలై 4 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్ పరీక్షలు నిర్వహిచనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 11న ఎప్సెట్ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలిపారు. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు రాసేవారికి ఇబ్బంది లేకుండా షెడ్యూల్ విడుదల చేసినట్లు చెప్పారు. దానికి అనుగుణంగానే పదోతరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేశామన్నారు. ఆగస్టు 15 తర్వాత ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసి సెప్టెంబర్ 2వ వారంలో తరగతులు కూడా ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. పరీక్షా విధానం, ర్యాంకుల ప్రకటనలో మార్పుల్లేవని మంత్రి స్పష్టంచేశారు.