Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ఏపీకే కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించింది : జీవీఎల్‌

వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులతో పథకాలకు తమ పేర్లు పెట్టుకుని సొంత డబ్బాలు కొట్టుకుంటోందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ఏపీకే కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించిందని చెప్పారు. కరోనా సమయంలో కేంద్రం 20 నెలల పాటు ఉచిత బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేసిందన్నారు. గత ఆరేళ్లలో 24 వేల కోట్లు ఆహార సబ్సిడీ కింద ఏపీకి కేంద్రం ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఏమి చేసిందన్న దానిపై వైసీపీతో చర్చకు బీజేపీ సిద్ధమన్నారు. అబద్దాలు ప్రచారాలు చేసి వైసీపీ, టీడీపీ పార్టీలు ప్రజలను మభ్య పెడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సాయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img