Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏపీలో కొత్తగా 1,010 కరోనా కేసులు

13 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 58,054 మంది నమూనాలు పరీక్షించగా 1,010 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 13 మంది మృతిచెందారు. కరోనా నుంచి నిన్న 1,149 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది రాష్ట్రంలో డిశ్చార్జ్‌ అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,50,324 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 14,176 కు చేరింది.ఏపీలో ఇప్పటివరకు 2,82,93,704 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img