Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నోటిని అదుపులో పెట్టుకోకపోతే బడితపూజ తప్పదు

వంగలపూడి అనిత
వైసీపీ నేతల భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అనిత టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పేర్నినాని, పోసాని కృష్ణ మురళి మాటలు జుగుస్పాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. వారిద్దరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడుతున్నవారు రేపు మాపైనా మాట్లాడతారని, మహిళలను వైసీపీ నేతలు తిడుతుంటే ముఖ్యమంత్రికి సంగీత విభావరి వింటున్నట్టుందా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోకపోతే బడితపూజ తప్పదని వంగలపూడి అనిత హెచ్చరించారు.డాక్టర్‌ సుధాకర్‌ మృతికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డే కారణమని, ఆయనను ప్రధమ ముద్దాయిగా చేర్చి చార్జ్‌ షీట్‌ ఓపెన్‌ చేయాలని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img