ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 59,566 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,378 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మహమ్మారిబారినపడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,877కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,139 మంది బాధితులు కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,88,101 మంది రాష్ట్రంలో డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 14,702 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,16,680కు చేరింది.