ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 69,606 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,71,554 కు చేరింది. గడిచిన 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,428 కు చేరింది. నిన్న ఒక్కరోజు 1,940 మంది కొవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,37,956 మంది డిశ్చార్జ్ అయ్యారు.ఏపీలో ప్రస్తుతం 20,170 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి