Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏపీలో కొత్తగా 2,567 కరోనా కేసులు


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 81,763 శాంపిల్స్‌ పరీక్షించగా కొత్తగా 2,567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో ఇప్పటివరకు 19,26,988 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 26,710 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా 3,034 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 18,87,236కి చేరింది. తాజాగా వైరస్‌ కారణంగా 18 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 13,042కి చేరింది.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.నిన్న జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం 81, చిత్తూరు 300, తూర్పుగోదావరి 356, గుంటూరు 269, కడప 75, కృష్ణ 269, కర్నూలు 18, నెల్లూరు 244, ప్రకాశం 351, శ్రీకాకుళం 77, విశాఖపట్నం 199, విజయనగరం 49, పశ్చిమ గోదావరి 279 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img