సీఎం జగన్
చేపల వినియోగం పెంచే దిశగా రాష్ట్రంలో ఆక్వా హబ్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. చేపల వినియోగం పెరగాలని, సరసమైన ధరలకు ప్రజలకు చేరాలని అధికారులకు సూచించారు. ఇవాళ పశుసంవర్ధకశాఖ, డెయిరీ, ఫిషరీస్ విభాగాలపై వైఎస్ జగన్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, చేపల రవాణా, నిల్వ తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు.ఆక్వా లాబ్స్ను వినియోగించుకోవడంపై ప్రచారం, అవగాహన కల్పించాలని సూచించారు. ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. కేజ్ ఫిష్ కల్చర్పై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, రైతులు, ఔత్సాహికులతో కలిసి ముందుకు సాగేలా ఒక ప్రణాళిక తీసుకురావాలని తెలిపారు.