: విజయసాయిరెడ్డి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దిల్లీలో చేపట్టే నిరసనలకు వైకాపా సంఫీుభావం తెలిపింది. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్తో స్టీల్ప్లాంట్ కార్మికులు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..ఆగస్టులో జంతర్మంతర్ వద్ద చేపట్టబోయే కార్మికుల నిరసనలకు మద్దతు ప్రకటిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఆర్థిక, ఉక్కుశాఖ మంత్రులను కలిసి మాట్లాడతామని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సరికాదని విజయసాయిరెడ్డి అన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల్లోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని, స్టీల్ప్లాంట్ రుణాలను ఈక్విటీగా మార్చాలని తెలిపారు.