Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీలో కొత్తగా 771 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 45,592 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 771 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,48,230 కు చేరింది. కరోనా మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 8 మంది మృతిచెందారు. దీంతో మరణాల సంఖ్య 14,150 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,333 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 19,89,391 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 11,912 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img