ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4న ఉదయం 9.05 నుంచి 9.45 మధ్య కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 6న వాలంటీర్ల సేవలకు సత్కార కార్యక్రమం జరగనుంది. ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడిరచింది. అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలు, సలహాలపై అధికారులతో జగన్ చర్చించారు.