Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదరీ మణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు అద్భుతమైన నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ మోదీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img