ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది.రూ.2,56,256 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. తమిళ కవి తిరువల్లువార్ సూక్తులతో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2.56,256 కోట్లు రెవెన్యూ వస్తుందని, వ్యయం రూ. 2,08,261 కోట్లు ఉంటుందని వెల్లడిరచారు. రెవెన్యూలోటు రూ 17, 036 కోట్లు, ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు ఉంటుందని వివరించారు. సెకండరీ ఎడ్యుకేషన్కు రూ. 27, 706 కోట్లు , ఈడబ్ల్యూఎస్కు రూ. 10,201 కోట్లు సివిల్ సప్లైస్కు రూ. 3,719 కోట్లు, ఆర్థిక శాఖకు రూ. 58,583 కోట్లు ఉంటుందని వెల్లడిరచారు. జీఏఈడీకి రూ.998 కోట్లు , సచివాలయ వ్యవస్థకు రూ. 3,396 కోట్లు , వ్యవసాయానికి రూ. 11, 387 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ. 1,568 కోట్లు అందజేస్తున్నామన్నారు. బీసీ సంక్షేమానికి రూ. 20,962 కోట్లు, పర్యావరణం, అటవీ శాఖకు రూ. 685 కోట్లు , ఉన్నత విద్యకు రూ. 2,014 కోట్లు , విద్యుత్కు రూ. 10,281 కోట్లు ఈ సంవత్సరానికి కేటాయించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.