Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఏబీ వెంకటేశ్వరరావుకు షోకాజ్‌ నోటీసు

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు జారీచేసింది. గత నెల 21న ఏబీ వెంకటేశ్వరరావు పెట్టిన ప్రెస్‌ మీట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మీడియాతో మాట్లాడడంపై వివరణ కోరుతూ సీఎస్‌ సమీర్‌ శర్మ షోకాజ్‌ నోటీస్‌ జారీచేశారు. ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం పెట్టారని వెంకటేశ్వరరావుకి నోటీస్‌ ఇచ్చారు. పెగాసస్‌తో పాటు తన సస్పెన్షన్‌ అంశాలపై ఆ రోజు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టడం తప్పేనంటూ నోటీస్‌లో సీఎస్‌ పేర్కొన్నారు. మెమో అందిన వారంలోగా వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img