కండలేరు జలాశయం పవర్ ప్లాంట్ నుంచి సాగు కోసం 5 వందల క్యూసెక్యుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కండలేరులో నీటి మట్టం 57 టీఎంసీలు ఉంది. తెలుగుగంగ చీఫ్ ఇంజినీర్ హరినారాయణ రెడ్డి మాట్లాడుతూ, మొదటి ఖరీఫ్ పంటకు 2.75 లక్షల ఏకరాలకు నీరు అందిస్తామన్నారు. చెన్నైకి 5 టీఎంసీలు నీరు ఇచ్చామని తెలిపారు. డిమాండ్ను బట్టి 2,500 క్యూసెకుల వరకు నీటి విడుదల పెంచుతామని చెప్పారు.