సబ్జెక్ట్లేని సీఎం జగన మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందని అన్నారు. 15 ఏళ్ళ నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్ఎస్బీసీ మూతపడటం బాధాకరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్ఎస్బీసీ కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలని..విశాఖని దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చూడాలని అన్నారు.