కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు భార్య సునీత డైమండ్ నెక్లెస్ చోరీకి గురైంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఆమె హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 11న ఆమె డైమండ్ నెక్లెస్ ధరించి ఓ ఫంక్షన్కు హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగించుకుని ఇంటికి చేరుకున్న కాసేపటికే నెక్లెస్ మాయమైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సునీత పేర్కొన్నారు. తన ఇంట్లోని పనివారిపైనే ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సునీత ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.