Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కృష్ణానదిలో కృష్ణ అస్థికలు.. నిమజ్జనం చేసిన మహేష్‌ బాబు

సినీ నటుడు మహేష్‌ బాబు ఆయన తండ్రి కృష్ణ అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. కరకట్ట, తులసీవనం దగ్గర కృష్ణానదిలో కృష్ణ అస్థికలు కలిపారు. మహేశ్‌ బాబు కుటుంబం శాస్త్రోక్తమైన కార్యక్రమాలు నిర్వహించింది. మహేష్‌ బాబు ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకొని రోడ్డు మార్గాన విజయవాడకు చేరుకున్నారు. మహేష్‌ బాబు వెంట బావలు సంజయ్‌ స్వరూప్‌, జయదేవ్‌, సుధీర్‌ బాబు, చిన్నాన్న ఆదిశేషగిరిరావు, దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, మెహర్‌ రమేష్‌, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img