Friday, April 26, 2024
Friday, April 26, 2024

కేంద్రంపై ఒత్తిడి పెంచి నిధులు సాధించటం చేతకాదా ?

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
పోలవరం ప్రాజెక్టుగా మారుతుందా లేక బ్యారేజిగానే మిగిలిపోతుందా అనేది ముఖ్యమంత్రి న్మోహన్‌ రెడ్డి సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకమేనా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు పనిపూర్తి, నిర్వాసితులకు పరిహారం విషయంలో జగన్‌ సర్కార్‌ విఫలమైందని విమర్శించారు. రాజశేఖర్‌ రెడ్డి ఆశయాన్ని జగన్‌ నీరుగారుస్తున్నారన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి నిధులు సాధించటం జగన్‌కు చేతకాదా అని నిలదీశారు. చేతకాకపోతే పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించేయాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్‌ రెడ్డి లోపాయికారి ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img