ఓ దివ్యాంగుడు జగన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రి జగన్కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా, వెంకటగిరి పరిధిలోని వెలంపాలెంలో జరిగింది.దివ్యాంగుడు వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు నరసింహులు వారి చెప్పులతో వారే కొట్టుకుని నిరసన తెలిపారు.వెంకటేశ్వర్లుకు రెండు కాళ్లు పనిచేయవు.. అలాగే చేతులు వంకర తిరిగాయి. గతంలో ఆయనకు పింఛను మంజూరైంది. ప్రస్తుత జగన్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంతో దిక్కు తోచని స్థితి ఏర్పడిరది. తనలాంటి వందలాది మందికి పెన్షన్ తొలగించి ఆవేదన మిగిల్చారని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీలైతే న్యాయం చేయాలని లేకపోతే ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.