రైతుల పాదయాత్రపై ప్రభుత్వం వ్యూహం పన్నిందని ఎంపీ రఘురామకృష్ణ రాజు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ భారత్ జోడో యాత్ర కు లేని ఇబ్బంది రైతుల పాదయాత్రకే ఎందుకని ప్రశ్నించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. గాంధీపై వైసీపీ నేత విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలు సరికాదని తెలిపారు. గాంధీనే తిడితే.. అభినవ గాంధీ అయిన మా సీఎం పరిస్థితేంటి అంటూ రఘురామ వ్యాఖ్యలు చేశారు.