Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు

ధ్వంసమైన ఘాట్‌ రోడ్డు, యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు
తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డు కొంతమేర ధ్వంసమైంది.గత కొంత కాలంగా కురుస్తున్న వర్షాలకి భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి.రెండవ ఘాట్‌ రోడ్డు ధ్వంసం అయింది. బుధవారం ఉదయం 5.40 గంటల ప్రాంతంలో భారీ సైజు టన్నుల కొద్ది బరువున్న రాయి పైనుంచి పడటంతో ఘాట్‌ రోడ్డు నాలుగు ప్రాంతాలలో భారీగా కోతకు గురయ్యింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన ఘాట్‌ రోడ్డు మరమ్మతులు పనులను తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టింది.మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు రెండవ ఘాట్‌ రోడ్‌లో పూర్తిగా వాహనాలు నిలిపివేయడంతో అలిపిరిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. మొదటి ఘాట్‌ రోడ్డు నుంచి విడతల వారీగా తిరుమలకు వెళ్లడానికి వాహనాలకు అనుమతిస్తున్నట్లు టీటీడీ సీవీఎస్వో గోపీనాధ్‌ జెట్టి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img