రఘురామకృష్ణరాజు
త్వరలో తన పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని అన్నారు. తానే సమయం ఇస్తున్నానని, వారంలో నిర్ణయం చెప్పాలని పరోక్షంగా వైసీపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించి అన్నారు. తనపై అనర్హత వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని అన్నారు. తాను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళతానని, వైసీపీపై ఎంత వ్యతిరేకతం ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానని అన్నారు. రాజధానిగా అమరావతే కొనసాగేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.