ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో టీడీపీ విజయం సాధించింది. దీంతో దర్శి టీడీపీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. నగర పంచాయతీలో గెలుపొందిన వార్డు కౌన్సిలర్లు టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. గెలుపొందిన వార్డు కౌన్సిలర్లను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్, దర్శి ఇంచార్జ్ పమిడి రమేష్ అభినందించారు. దర్శి నగర పంచాయతీకి ఎన్నికలు తొలిసారి జరిగాయి. చైర్మన్గా నారపుశెట్టి పిచ్చయ్య పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది.