Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దళితులపై దాడులు చేస్తే టీడీపీ చూస్తూ ఊరుకోదు : అచ్చెన్నాయుడు


ఎస్సీ ప్రాతినిధ్య నియోజకవర్గాలలో వైసీపీ నేతలు ఎస్సీలపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. నందికొట్కూరులో టీడీపీ దళిత నేత శాంతరాజుపై దాడిచేసి అక్రమ కేసు బనాయించడం దుర్మార్గమని అన్నారు. భూ వివాదం పరిష్కరించాలని అడగటం శాంతరాజు చేసిన తప్పా? అని అడిగారు. శాంతరాజు అక్రమ అరెస్టుపై నిరసన తెలపడానికి వచ్చిన.. దళిత సంఘాలను బెదిరించే స్థాయికి వైసీపీ నేతలు తెగబడ్డారని చెప్పారు. జగన్‌కి భయపడే మంత్రులు దళితులపై తమ ప్రతాపం చూపడం సిగ్గుచేటన్నారు. దళితులపై దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img