Friday, April 26, 2024
Friday, April 26, 2024

నాటుసారా మరణాలపై టీడీపీ నిరసన.. ఎమ్మెల్యేల అరెస్ట్‌…

నాటుసారా మరణాలపై ఏపీలో తెలుగుదేశ పార్టీ నాయకుల నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా నాటుసారా మరణాలు, కల్తీ మద్యం బ్రాండ్లపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ వినతిపత్రం ఇచ్చేందుకు ఇవాళ ప్రసాదంపాడు ఎక్సైజ్‌శాఖ కార్యాలయానికి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, నిమ్మకాయల చినరాజప్ప, ఆదిరెడ్డి భవాని, బెందాళం అశోక్‌, మరికొంతమంది ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ప్రసాదంపాడు ఎక్సైజ్‌శాఖ కార్యాలయానికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే కనీసం ఐదుగురినైనా లోపలకు అనుమతించాలని, కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చి వస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు కోరినా పోలీసులు వినలేదు. తామేమి నేరం చేయడానికి రాలేదని ఎందుకు అడ్డుకుంటున్నారని నేతలు పోలీసులను ప్రశ్నించారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. చివరికి టీడీపీ నేతలను అరెస్టు చేసి వేరే బస్సులో తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img