ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీలోని ఓ నేత తనపై చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న నారాయణస్వామి.. పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కుట్రంతా గంగాధర నెల్లూరు మండలంలో మాత్రమే జరుగుతోందన్నారు. ఆరోపణలు చేసిన నేత పేరు ప్రస్తావించని నారాయణ స్వామి.. తనను అవమానించిన విషయం తెలిస్తే ఏమవుతుందో తెలియటం లేదంటూ సదరు నేతకు హెచ్చరికలు జారీ చేశారు. అవినీతి చేశానని నిరూపిస్తే.. వాళ్ల కాళ్లు పట్టుకునేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. ఇలాంటి ఆరోపణల వల్ల భవిష్యత్తులో సీఎం జగన్కు తనపై నిజంగానే కోపం వచ్చే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.