Friday, April 26, 2024
Friday, April 26, 2024

శ్రీకాకుళం జిల్లాలో టెన్త్‌ హిందీ పేపర్‌ లీక్‌ వదంతులు..విచారణకు కలెక్టర్‌ ఆదేశం

శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్‌ లీక్‌ అయినట్లు వదంతులొచ్చాయి. సరుబుజ్జిలి మండలంలోని రొట్ట వలస, సలంత్రీ పరీక్షా కేంద్రాల నుంచి హిందీ పేపర్‌ లీక్‌ అయినట్లు వదంతులొచ్చాయి. దీనిపై కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ విచారణకు ఆదేశించారు. మరోవైపు జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ కాలేదని డీఈఓ వివరణ ఇచ్చారు. వదంతులు ప్రచారం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. కాగా నిన్న పలు కేంద్రాల్లో తెలుగు పరీక్షా పత్రం లీక్‌ అయింది. అయితే ఇది పేపర్‌ లీక్‌ కాదని, మాల్‌ ప్రాక్టీస్‌ అని విద్యాశాఖ అధికారులు చెప్పారు. ఘటనకు సంబంధించిన వారిని అరెస్టు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ ఫోన్లు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img