Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పట్టాభి మాట్లాడిన భాష గతంలో ఎన్నడూ వినలేదు

: ఏపీ డీజీపీ
విజయవాడకు డ్రగ్స్‌తో ఏమాత్రం సంబంధం లేదని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. డ్రగ్స్‌పై ఇన్నిసార్లు స్పష్టంగా చెప్పినా పదేపదే ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. అసభ్య పదజాలం ఎవరికీ మంచిది కాదని అన్నారు. పార్టీ కార్యాలయం నుంచి దారుణంగా మాట్లాడారని చెప్పారు. ‘పట్టాభి వ్యాఖ్యల తర్వాత ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఒక పార్టీ కార్యాలయంలో కూర్చుని ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదు. ఇలాంటి భాషను సమాజంలో ఎవరూ అంగీకరించరు. పట్టాభి మాట్లాడిన భాష గతంలో ఎన్నడూ వినలేదు. రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలి’ అని హితవు పలికారు.విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాన్ని మరువలేమని డీజీపీ అన్నారు. ఎలాంటి క్లిష్ట సమయంలోనైనా పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. రేపు పోలీసు ఫ్లాగ్‌ డే నిర్వహిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img