Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పట్టాభి మాట్లాడిరది తప్పు అని చంద్రబాబు చెప్పాలి

ఎమ్మెల్యే అంబటి రాంబాబు
వైసీపీపై బురదజల్లే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలను, మాట్లాడిన భాషను చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనూ డీజీపీ పనిచేశారని, ఒక ఐపీఎస్‌ అధికారిని పాలేరు అంటూ వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. పట్టాభి మాట్లాడిరది తప్పు అని చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసులను తక్కువ చేసి మాట్లాడితే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. వైసీపీ ముఖ్యమంత్రిని తిట్టడం తప్పని చెప్పి నిరాహార దీక్షకు కూర్చోవాలన్నారు. పట్టాభి వ్యాఖ్యలపై చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img