Friday, April 26, 2024
Friday, April 26, 2024

పది ప్రశ్నాపత్రం లీక్‌ అవాస్తవం..తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: కలెక్టర్‌ హరి నారాయణ

చిత్తూరులో టెన్త్‌ క్లాస్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ అయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని జిల్లా కలెక్టర్‌ హరి నారాయణ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షలు ప్రారంభమైన రెండు గంటల తర్వాత సామాజిక మాధ్యమాల్లో పేపర్‌ లీక్‌ అయినట్లు వచ్చిందని తెలిపారు. కొందరు వ్యక్తులు డీఈఓకు వాట్సప్‌ ద్వారా పేపర్‌ లీక్‌ అయినట్లు మెసేజ్‌ పెట్టారని అన్నారు. విద్యార్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వాట్సాప్‌ ద్వారా వచ్చిన సమాచారంపై డీఈఓ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని అన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img