Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాం

కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం ఇటీవల నీతి అయోగ్‌తో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్ర వాటా ఉంటుందని చెప్పారు. .అవశేష ఏపీ అభివృద్ధికి అవసరమైన సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2015-16 నుంచి 2019-20 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్‌లకు రుణం సమకూర్చడంతోపాటు ఆ రుణంపై వడ్డీని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img