: చంద్రబాబు
అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ది వైసీపీ ప్రభుత్వ హత్యేనని, జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుతో.. కోడెల తరహాలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కోడెల ద్వితీయ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన కోడెల చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పరువు కోసం బతికిన కోడెల.. ఆ పరువు కోసమే ప్రాణాలు కోల్పోయారన్నారు. చేపట్టిన పదవులన్నింటికీ.. కోడెల వన్నె తెచ్చారని కొనియాడారు.కోటప్పకొండను ఆదర్శంగా అభివృద్ధి చేశారని చెప్పారు.జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుతో.. కోడెల తరహాలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. నంద్యాలలో అబ్దుల్ సలాం ఘటనే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. రాష్ట్రంలో ఆఫ్ఘనిస్తాన్ కంటే ఘోరంగా మృగాలు పెట్రేగిపోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.