Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రాణం ఉన్నంత వరకు జగనన్న వెంటే.. : రోజా

ఏపీ కొత్త కేబినెట్‌లో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడారు.‘ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని జగనన్న నాకు ఇచ్చారు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను జగనన్న వెంటే నడుస్తాను. ముఖ్యమంత్రి జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, మహిళల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. పర్యాటకం, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఆయా రంగాల అభివృద్ధికి కృషి చేస్తాను’’ అని రోజా అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img