Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బిగ్‌ బాస్‌ షోపై హైకోర్టులో విచారణ..నాగార్జునతో పాటు కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

స్టార్‌ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌ బాస్‌ షోపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బిగ్‌బాస్‌లో అశ్లీలత ఎక్కువగా ఉందని, కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేదని… ఈ నేపథ్యంలో బిగ్‌ బాస్‌ షోను రద్దు చేయాలంటూ ఇటీవలే హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ జరగగా.. తాజాగా గురువారం జరిగిన విచారణలో ప్రతివాదులకు నోటీసులు జారీ అయ్యాయి. రెండు వారాల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోర్టు… నాగార్జునతో పాటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img